టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మరోసారి తమ అప్రమత్తతతో శెభాష్ అనిపించుకున్నారు. తమిళనాడుకు చెందిన భక్తుడు శ్రీవారి దర్శనం కోసం వచ్చి తన బ్యాగ్ చెక్ పాయింట్ వద్ద మర్చిపోయారు. ఈ విషయాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే అతనికి సమాచారం అందించి.. బ్యాగ్ తిరిగి అప్పగించారు, బ్యాగులో ఐదు లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి భక్తుడు కృతజ్ఞతలు తెలియజేశారు.