ఊరి సమస్యల పరిష్కారం కోసం ఓ అంధుడు తనకు ఉన్న 15 సెంట్ల భూమిని దానంగా ఇచ్చిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం నందిగరువు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బాలరాజుకు పుట్టుకతోనే కంటి చూపు లేదు. అయినప్పటికీ ఊరి సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ క్రమంలోనే తమ ఊరిలో బడి, అంగన్వాడీ కేంద్రం, రేషన్ షాపు నిర్మాణం కోసం తనకు ఉన్న 14 సెంట్లను దానంగా అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని అభినందించి.. ఆయా నిర్మాణాలకు అతని పేరే పెట్టాలని ఆదేశించారు.