అవయవ దానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నా.. గత ఐదేళ్లలో వెయిటింగ్ లిస్టులో ఉన్న 113 మంది రోగులు సరైన సమయంలో అవయవాలు అందక మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల్లో అవగాహన లోపం, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కుటుంబ సభ్యుల భావోద్వేగాలు అవయవ దానానికి ఆటంకాలుగా మారుతున్నాయి. సామాజిక బాధ్యతగా అవయవ దానాన్ని చూడాలని, ముందుగానే ప్రతిజ్ఞ చేసి కుటుంబ సభ్యులతో చర్చించాలని నిపుణులు సూచిస్తున్నారు.