తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈసారి కేసీఆర్ హాజరుతో పాటు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తన నియోజకవర్గంలోని డ్రైనేజీ, హైటెన్షన్ వైర్లు, విద్యాసంస్థల సమస్యలను ఆయన ప్రస్తావించారు. అనుభవజ్ఞుడిలా సమస్యలను లేవనెత్తిన నవీన్ యాదవ్ను తోటి సభ్యులు అభినందించారు.