గత ప్రభుత్వంలో భూముల రీసర్వేలో తప్పులు దొర్లాయని, వాటిని సరిదిద్ది కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే తొలి విడత పంపిణీ మొదలవ్వగా, రెండో విడత పంపిణీపై కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 9న పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 గ్రామాల్లో ఈ పంపిణీ జరగనుంది. రైతులు గ్రామసభలకు హాజరై తమ భూ వివరాలను సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.