National Highways in Telangan: తెలంగాణలోని జగిత్యాల, మహబూబ్నగర్ జిల్లాల్లో రూ.10,034 కోట్లతో 271 కిలోమీటర్ల మేర నాలుగు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా వీటికి సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టులు ఫిబ్రవరి 2026లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. ఈ విస్తరణతో ప్రయాణ సమయం తగ్గి, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది.