ఆ ఉద్యోగులకు షాక్.. సంక్రాంతి సెలవు రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!

1 month ago 4
సంక్రాంతి పండుగ వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైంది. విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవులు ప్రకటించినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు షాకిచ్చింది. వారు మాత్రం పండగ సెలవు రోజుల్లో కూడా తప్పనిసరిగా పనిచేయాలని ఆదేశించింది. సెలవు రోజుల్లో కూడా కనీసం ఒక ఉద్యోగి అయినా విధుల్లో ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే, సెలవుల్లో పనిచేసే వారికి అదనపు సెలవులు ఇవ్వకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Entire Article