Uravakonda Library Names: అనంతపురం జిల్లా ఉరవకొండలో విచిత్రమైన సన్నివేశం కనిపించింది. అక్కడ ఉ్న గ్రంథాలయంలో సినీ, రాజకీయ ప్రముఖులు, దివంగత నేతలు కూడా పుస్తకాలు చదివినట్లు రిజిస్టర్లో సంతకాలు కనిపించడంతో మంత్రి పయ్యావుల కేశవ్ షాక్కు గురయ్యారు. రోజుకు 50-60 మంది వస్తున్నారని ఉద్యోగి చెప్పడంతో అనుమానం వచ్చి రికార్డులు పరిశీలించగా ఈ వింత బయటపడింది. ఈ నిర్లక్ష్యంపై ఆగ్రహించిన మంత్రి, రికార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని ఆదేశించారు.