భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పాలనా సౌలభ్యం, గిరిజనుల సంక్షేమం దృష్ట్యా ఈ విలీనం అత్యవసరమని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి కూడా ఇదే అంశంపై ఇటీవల కేంద్రాన్ని నిలదీశారు. విభజన హామీల అమలులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ.. ఐదు గ్రామాల విముక్తి కోసం గళమెత్తారు.