ఆ గ్రామంలో 69 ఏళ్ల తర్వాత మొదటిసారి ఎన్నికలు.. ఇన్నాళ్లు ఏం జరిగిందంటే..

2 months ago 6
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో 69 ఏళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి తెరపడింది. పంచాయతీ ఏర్పడిన నాటి నుండి ఇక్కడ ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు.. కానీ ఈసారి ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవడంతో తొలిసారిగా పోలింగ్ నిర్వహించారు. పండగ వాతావరణంలో జరిగిన ఈ చారిత్రాత్మక ఎన్నికలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ మద్దతుదారుడు దేవ్‌రావుకు 1028 ఓట్లు రాగా.. కాంగ్రెస్ బలపరిచిన సిడాం లక్ష్మణ్‌కు 728 ఓట్లు వచ్చాయి. దీనితో 300 ఓట్ల మెజారిటీతో దేవ్‌రావు సర్పంచిగా విజయం సాధించారు.
Read Entire Article