తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని నర్కూడ గ్రామంలో.. సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల ఆ గ్రామానికి ఆదాయ వనరులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రలోభాలకు ఓటర్లు లొంగకుండా.. గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థులను ఎన్నుకోవాలి.