జాతీయ రహదారి 65 విస్తరణ పనుల టెండర్లను డిసెంబర్లో ఆహ్వానించి, జనవరిలో పనులు ప్రారంభిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. చిట్యాల మండలంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ రోడ్డు అలైన్మెంట్ ఇప్పటివరకు జరగలేదని, రైతులు అపోహలు పెట్టుకోకూడదన్నారు. దివిస్ కంపెనీ కోసం మార్పులు చేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. డిసెంబర్లో అలైన్మెంట్ పూర్తయ్యాక సీఎం, మంత్రిమండలిలో చర్చించి గ్రామసభల ద్వారా రైతులను ఒప్పించి పనులు ప్రారంభిస్తామన్నారు.