ఆ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు..

4 months ago 9
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని బద్దిపడగ పాఠశాల హెచ్‌ఎం పద్మను సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ హైమావతి ఆ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం వంటకాలు అందించకుండా, పప్పుకు బదులు మొక్కజొన్న పిండితో సాంబార్ వండటాన్ని.. అందులో నీళ్లు పోయడాన్ని కలెక్టర్ గుర్తించారు. విద్యార్థులకు నాణ్యతలేని భోజనం అందించినందుకు హెచ్‌ఎంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించగా, జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article