Kothagudem Bus Stand New Building: భద్రాద్రి కొత్త గూడెం ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్లో సరైన వసతులు లేక.. శిథిలావస్థలో దారుణంగా ఉన్న పాత బస్టాండ్ స్థానంలో రూ.10 కోట్ల వ్యయంతో కొత్త బస్టాండ్ నిర్మించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. పాత బస్టాండ్ని సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీంతో అది శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే కొత్త బస్టాండ్ నిర్మించబోతున్నారు.