ఖమ్మం జిల్లాను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన పలు కీలక ప్రాజెక్టులను వివరించారు. నగరంలో ప్రపంచస్థాయి క్రికెట్ స్టేడియం, ఖిల్లా వద్ద రోప్ వే, మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి వంటి భారీ నిర్మాణాలు జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీ, శిల్పారామం పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఆధ్యాత్మికత కోసం 20 ఎకరాల్లో టీటీడీ తరహాలో శ్రీవారి ఆలయం నిర్మిస్తామని వెల్లడించారు.