Nellore District Kris City: నెల్లూరు జిల్లాకు రూ.37,500 కోట్ల భారీ పెట్టుబడితో కృష్ణపట్నం పారిశ్రామిక నగరం (క్రిస్ సిటీ) రాబోతోంది. 4,67,500 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుతో సింహపురి పారిశ్రామికంగా దూసుకుపోనుంది. చెన్నై, కృష్ణపట్నం పోర్టులు, రేణిగుంట విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే లైన్ వంటి అనుకూలతలు పరిశ్రమల స్థాపనకు దోహదం చేస్తాయి. 2026 ఫిబ్రవరి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.