భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మరో జాతీయ రహదారి (NH 930P) మంజూరైంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే కొత్తగూడెం నుండి హైదరాబాద్కు ప్రయాణ దూరం 40 కిలోమీటర్లు తగ్గుతుంది. ఇల్లెందు, మహబూబాబాద్, తొర్రూరు మీదుగా గౌరెల్లి జంక్షన్ వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం ఇల్లెందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని సుమారు 4.85 హెక్టార్ల భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.