నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు రూ.11.33 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపే నూతన అభివృద్ధి మాడల్ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ, నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. దేవరకొండకు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తామని, పడావు పడిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.