ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు CCI షాక్ ఇచ్చింది. పత్తి నాణ్యత లేదనే సాకుతో క్వింటాల్కు రూ. 50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త ధర రూ. 8,050గా మారింది. పత్తి పింజా పొడవు తగ్గడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ధర తగ్గింపుతో పాటు.. కొనుగోలు పరిమితిని ఎకరాకు 12 నుండి 7 క్వింటాళ్లకు కుదించడంపై రైతులు మండిపడుతున్నారు. అలాగే 'కపాస్ కిసాన్ యాప్' ద్వారా స్లాట్ బుకింగ్ నిబంధన, తేమ శాతం పరిమితులు గ్రామీణ రైతులకు శాపంగా మారాయి.