విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారనే ఆరోపణలపై కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ తలారి రాజ్ కుమార్ను ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆరోపణలపై నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.