ఏపీ ప్రభుత్వం గ్రామీణ రహదారుల అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులకు ప్రాధాన్యం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. పల్లె రహదారులను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్టుతో పాటుగా సాస్కీ నిధులను పెద్ద ఎత్తున కేటాయించింది. ఈ నిధుల సాయంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రహదారులను అభివృద్ధి చేయనున్నారు.