New Government Hospital Jagtial: జగిత్యాల పట్టణంలో రూ.235 కోట్లతో 450 పడకల సామర్థ్యంతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేయనున్నారు. ఈ ఆసుపత్రి జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి సహకారంతో వైద్య, విద్యా రంగాలకు అధిక నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. త్వరలోనే ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తి అవుతుంది అన్నారు.