AYUSH Hospital in Karimnagar: కరీంనగర్ ప్రజలకు కేంద్రం పండగ కానుకగా 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేసింది. రూ.15 కోట్లతో నిర్మించనున్న ఈ ఆసుపత్రికి ఇప్పటికే రూ.7.5 కోట్లు విడుదలయ్యాయి. ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం వంటి సంప్రదాయ చికిత్సలతో పాటు, కాయచికిత్స, పంచకర్మ, శస్త్రచికిత్స వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి వల్లే కరీంనగర్లో ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటు కాబోతుందంటున్నారు జిల్లా వాసులు.