తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు కొత్త నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇప్పటికే ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా.. రాష్ట్రంలో ఏకసభ్య కమిషన్ నియమించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసేందుకు ఈ ఏకసభ్య కమిషన్ కేవలం 60 రోజుల్లోనే నివేదిక సమర్పించేలా చూడాలని సూచించారు. కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాతనే.. రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించారు.