సత్యసాయి జిల్లా కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బ్రహ్మరథోత్సవంలో భాగంగా రథం కిందపడి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని కాపాడే క్రమంలో మరో ఐదుగురు భక్తులు గాయపడ్డారు. వీరందరినీ వెంటనే కదిరి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రోజున రథోత్సవం నిర్వహించారు.