Vemireddy Prabhkar Reddy Comments: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను టీడీపీలో చేరడం దైవ సంకల్పమని, క్రమశిక్షణ గల వ్యక్తులతో పనిచేసే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ముంగలదొరువులో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలో విద్యార్థినులకు, దివ్యాంగులకు ఉచిత సైకిళ్లు, ట్రైసైకిళ్లు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.