విశాఖపట్నంలో ఈఎస్ఐ తమ మొట్టమొదటి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. మల్కాపురంలోని 125 బెడ్ల ఈఎస్ఐ హాస్పిటల్ను మెడికల్ కాలేజీకి అనువుగా మార్చాలని ప్రతిపాదనలు పంపారు. శిథిలావస్థలో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ను తొలగించి, 50 సీట్లతో కాలేజీని త్వరలోనే దీన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి హాస్పిటల్ను తాత్కాలికంగా అప్పగించాలని కేంద్ర ఈఎస్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.