Razole Tdp Incharge Gollapalli Amulya: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో తండ్రీకూతుళ్లు వేర్వేరు పార్టీల నుంచి ఇంఛార్జ్లుగా నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ ఇంఛార్జ్గా గొల్లపల్లి సూర్యారావు ఉండగా, ఆయన కుమార్తె గొల్లపల్లి అమూల్యను టీడీపీ ఇంఛార్జ్గా నియమించింది. దీంతో రాజోలు నియోజకవర్గంలో తండ్రి ఒక పార్టీ నుంచి, కూతురు మరో పార్టీ నుంచి రాజకీయాలు చేయనుండటం చర్చనీయాంశంగా మారింది.