బీఆర్ఎస్, బీజేపీ కారణంగా కరీంనగర్ పట్టణం వెనుకబడిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆ రెండు పార్టీల కారణంగానే.. అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. తాము అధికారంలోకి రాగానే.. పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగానే పట్టణం చుట్టూ రింగు రోడ్డు నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కీలక ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు.