ఉగాది పర్వదినం 30వ తేదీన తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. పేదలకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడానికి సర్వం ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి ఇది రానుంది. సుమారు 91 లక్షల రేషన్ కార్డుదారులకు 2.82 కోట్ల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతోంది. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున అందజేయనున్నారు.