హైదరాబాద్లోని యూఎల్సీ భూముల్లో ఉన్న ఇళ్లు, ఖాళీ ప్లాట్లపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని హైడ్రా స్పష్టం చేసింది. కేవలం పార్కులు, రహదారులు, ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలను మాత్రమే తొలగిస్తామని వెల్లడించింది. 19.07.2024 లోపు నిర్మించిన నివాసాలు భద్రమని, కబ్జాదారుల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు భరోసా ఇచ్చింది. ఏదైనా సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తూ.. ఆక్రమణల నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే తమ ప్రాధాన్యమని హైడ్రా పేర్కొంది.