Hd Kumara Swamy On Infosys Go To AP: కర్ణాటక ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి కుమారస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలను అవమానించేలా సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేశారని, ఏపీతో పెట్టుబడుల విషయంలో కర్ణాటక వెనుకబడిపోతోందని విమర్శించారు. ఇన్ఫోసిస్ కంపెనీ గురించి కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రహదారుల మరమ్మతులపై కూడా విమర్శలు వస్తున్నాయని, ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.