తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి సంచారంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రజలు ఎరుపు రంగు దుస్తులు ధరించవద్దని, ఉదయం 10 తర్వాతే బయటకు వెళ్లి, సాయంత్రం 5 లోపు ఇళ్లకు చేరాలని హెచ్చరికలు జారీ చేశారు. పులి దాడి ఘటనలు భయపెడుతుండటంతో, రైతులు, కూలీలు పొలం పనులకు వెళ్లడానికి జంకుతున్నారు. అధికారులు గస్తీ ముమ్మరం చేశారు. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని పులి కనిపిస్తే.. అరవాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు..