Nandivelugu Rail Over Bridge Update: గుంటూరులో కీలకమైన నందివెలుగు రోడ్డులో ఆర్వోబీ నిర్మాణం మళ్లీ ఊపందుకుంది. నిధుల కొరతతో ఆగిపోయిన పనులను కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో రైల్వేశాఖ రూ.36.91 కోట్లు విడుదల చేయడంతో వేగవంతం చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ట్రాఫిక్ సమస్య త్వరలో తీరనుంది. ఈ ఆర్వోబీ పనులు మరింత వేగంగా సాగుతున్నాయి. వీలైనంత త్వరగా అందబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.