ISCKON Project in Penukonda: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తోంది. దీనిలో భాగంగా రూ. వందల కోట్లతో బాపట్ల జిల్లా సూర్యలంకలో మూడు రిసార్టులు, సత్యసాయి జిల్లా పెనుకొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టులకు భూములు కేటాయించింది. ఇవి పూర్తయితే.. ఈ ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూమి లీజుతో పాటు రాయితీలు కూడా అందిస్తోంది.