రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ భూ వివాదంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 45.37 ఎకరాల భూములకు సంబంధించిన 17 సేల్ డీడ్ల రద్దు చెల్లదని స్పష్టం చేసింది. ఎమ్మార్వో లేఖ ఆధారంగా సబ్రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం సరికాదని తేల్చిచెప్పింది. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా రద్దు చేయడం తప్పు అని కోర్టు అభిప్రాయపడింది.