రేవంత్ సర్కార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కొత్త మున్సిపల్ కార్పొరేషన్గా మార్చాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాలను విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. తాజాగా ఈ పిటిషన్ని విచారించిన కోర్టు మాత్రం.. ప్రస్తుతం కార్పొరేషన్ ఏర్పాటును నిలిపివేయడానికి నిరాకరించింది. సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.