Kurnool Lokayukta Apshrc Will Continue: లోకాయుక్త, మానవ హక్కుల సంఘం కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై హైకోర్టు స్పందిస్తూ, ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని, జోక్యం చేసుకోలేమని తెలిపింది. 2021లో దాఖలైన కౌంటర్ రికార్డుల్లోకి చేరకపోవడంతో విచారణ వాయిదా పడింది. నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేశారని పిటిషనర్లు సవాలు చేశారు.. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.