రేవంత్ రెడ్డి చొరవతో వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వేలైన్ రాబోతోంది. కొడంగల్ మీదుగా వెళ్లే ఈ 130 కి.మీ. మార్గానికి రూ. 2,784 కోట్లు ఖర్చవుతుంది. పారిశ్రామిక కారిడార్తో పాటు, గోవాకు ప్రయాణం సులభతరం అవుతుంది. భూసేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానిదేనని రైల్వే శాఖ కోరింది. త్వరలో DPR సమర్పించనున్నారు.