Mirchi Yellow Chilli Price: ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలకు కాసుల పంట పండింది. ముఖ్యంగా పల్నాడులో పసుపు రంగు మిరప క్వింటాల్ రూ.49,200 రికార్డు ధర పలికింది. సాధారణ మిరప ధర కూడా రూ.7 వేలకు చేరింది. వేరుశనగ ధర కూడా రూ.9,652కు పెరిగి, రైతుల ముఖాల్లో ఆనందం నింపింది. అంతర్జాతీయ మార్కెట్లో నూనె గింజలకు ఈ సంవత్సరం భారీ డిమాండ్ ఉందని ఇదే మన దగ్గర ధరల పెరుగుదలకి కారణం అంటున్నారు.