తెలంగాణలో రైతులు వరి సాగు నుంచి క్రమంగా ఆయిల్పామ్ తోటల సాగు వైపు మళ్లుతున్నారు. ఉమ్మడి ఖమ్మం తర్వాత ఇప్పుడు పాలమూరు జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రభుత్వం మొక్కలపై రూ. 173 రాయితీ, నాలుగేళ్ల పాటు ఎకరాకు రూ. 4,200 ప్రోత్సాహం అందిస్తోంది. బిందు సేద్యంపై 80 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీలు ఇస్తోంది. దిగుబడుల విక్రయానికి దళారి వ్యవస్థ లేకుండా గిట్టుబాటు ధర, పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.