ఆ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.10 వేలు ప్రకటన..

10 months ago 21
మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10,000 చొప్పున నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం సహకరించకపోయినా ప్రతి రైతుకు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, మున్నేరు వరద ఉద్ధృతిని ఖమ్మంలో పరిశీలించి.. ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Read Entire Article