నాగర్కర్నూల్ జిల్లాలో గుడికి వెళ్లిన ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరగటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేసే వ్యక్తి వివాహితను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాధితురాలితో కూడా ఆలయానికి వచ్చిన వ్యక్తి భర్త కాదని తెలుసుకొని స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.