మైసూరు రేణిగుంట వీక్లీ ఎక్స్ప్రెస్ను కడప వరకూ పొడిగించాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఈ విషయమై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అలాగే మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలుకు ముద్దనూరులో స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. వైఎస్ అవినాష్ రెడ్డి అభ్యర్థనపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు మైసూరు రేణిగుంట రైలును కడప వరకూ పొడిగించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది.