Ttd On Kapila Theertham Pinda Pradanam: కపిలతీర్థంలో పిండ ప్రధాన కార్యక్రమానికి టీటీడీ అనుమతి నిరాకరించిందని వచ్చిన వార్తలపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. ఆ స్థలం అటవీ శాఖ పరిధిలో ఉందని, తమ పరిధిలో లేదని స్పష్టం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. మరోవైపు, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు రథసప్తమి సందర్భంగా ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని సేవలు రద్దు చేయబడ్డాయి.