కేంద్ర భవ్య పథకం కింద దేశవ్యాప్తంగా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా తొలి దశలో దేశవ్యాప్తంగా 20 పార్కుల అభివృద్ధఇకి దరఖాస్తులు ఆహ్వానించగా ఏపీఐఐసీ ఆరింటికి ఆహ్వానం పలికింది. రెండు మాత్రమే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాంతో రెండో దశలో 16 చోట్ల పార్కుల అభివృద్ధికి వీలుగా ఏపీఐఐసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ 22తో పాటు మరో మూడు పార్కులను కూడా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దాని కోసమే ఇప్పుడు 25 పార్కులకు 20 ఎకరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.