తెలంగాణలో ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు మంత్రిమండలిలో చర్చించి శాసనసభలో బిల్లు ప్రవేశపెడతామని మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ తెలిపారు. ఆటో ఛార్జీలను కమిటీ నివేదిక ఆధారంగా పెంచుతామని, ప్రభుత్వ ఆధ్వర్యంలో యాప్ తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 18,766 ఆటోలకు రెట్రోఫిటింగ్ కోసం ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. అయితే ప్రభుత్వంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, తమ డిమాండ్లపై స్పష్టత రాలేదని ఆటో ఐకాస ప్రతినిధులు తెలిపారు.