మహారాష్ట్ర నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణలోకి ప్రవేశించిన మగ పులి భువనగిరి ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. ఆడ పులి కోసం ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకున్న ఈ పులి ప్రయాణం అటవీ అధికారులకు, ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. వేటగాళ్ల ఉచ్చులు దీని ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అటవీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.