ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. రాజ్నాథ్ సింగ్తో జరిగిన భేటీలో తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంతోపాటు.. మహబూబ్నగర్లో డీఆర్డీఓ ప్రాజెక్ట్, గాంధీ సరోవర్ ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు సహకరిస్తామన్న రేవంత్ రెడ్డి.. కార్గో, ఎమ్ఆర్ఓ, హ్యాంగర్ వంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.