గిరిజనులను అటవీ చట్టాల పేరుతో ఇబ్బంది పెట్టవద్దని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణతో పాటు గిరిజనుల అభివృద్ధి కూడా ముఖ్యమని అన్నారు. అటవీ ఉత్పత్తుల సేకరణ గిరిజనుల హక్కు అని.. అనవసర ఆంక్షలు తగదని పేర్కొన్నారు. అధికారులు నిబంధనలకు లోబడే వ్యవహరించాలని స్పష్టం చేశారు.